డబుల్ ఇస్మార్ట్‌ కు సంజయ్ దత్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా లెవెల్ లో డబుల్ ఇస్మార్ట్ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రామ్ స‌ర‌స‌న బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైత‌న్య‌ నటిస్తుందని టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చేస్తున్న సంగతి మూవీ టీమ్ స్వయంగా అనౌన్స్ చేశారు. సంజయ్ దత్ ఈ సినిమా చివరి వరకు కనిపిస్తాడట. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్స్ సన్నివేశాల కి సంజయ్ దత్ అయితేనే పర్ఫెక్ట్ గా నటించగలడు అన్న ఉద్దేశంతో పూరి జగన్నాథ్ సంజయ్ దత్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లో పెట్టుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు సంజయ్ దత్ కు 60 రోజుల కాల్షీట్ కోసం రూ.15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మి , పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా మార్చ్ 8,2024 న ప్రేక్షకులు ముందుకు రానుంది.