వాటిని పిచ్చ లైట్ తీస్కొంటోన్న స‌మంత‌…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటించిన సమంత.. బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్‌లో కూడా నటించింది. ప్ర‌స్తుతం సినీ లైఫ్ లో వరుస ప్లాప్ ల‌ను ఎదుర్కొంటున్న సమంత పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది.

సమంత – నాగచైతన్య విడాకులు తీసుకుని రెండు సంవత్సరాలైనా ఇప్పటికి సమంత గురించి ఏ విషయం బయటకు వ‌చ్చినా సోషల్ మీడియాలో అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. విడాకుల తర్వాత నుంచి సమంత ఏది చేసిన దాన్ని తప్పుపడుతూ చాలామంది నెటిజన్స్ సమంతపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటే సమంతపై ఓ న్యూస్ రాసేస్తే పోలే అనేలా మీడియా పరిస్థితి కూడా త‌యారైంది.

సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫారెన్ ట్రిప్ సమంత ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది సమంత. ఏం చేసినా అందులో తప్పు వెతుకుతూ వైరల్ చేస్తూ రాసే వార్తలను గతంలో సమంత పట్టించుకుని బాధపడిపోతూ ఉండేది.

ఇలాంటి వాటికి త‌న స్టైల్‌లో స‌మాధానం చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించేది. గ‌త కొంత‌కాలం నుంచి ఆ వార్తలను లైట్ తీసుకుంటుంది స‌మంత‌. దీంతో సమంతలో వచ్చిన ఈ మార్పుకు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సమంత యూఎస్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిందంటూ వచ్చిన వార్తలకు సమంత పోస్ట్ చేస్తున్న పిక్స్ కు అసలు సంబంధం లేదు అంటూ షాక్ అవుతున్నారు జనం.