ప్రభాస్ ఈ రోజు ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రభాస్ నుంచి లైన్లో ఉన్న నెక్ట్స్ పాన్ ఇండియా సినిమా సలార్. ఈ యేడాది సెప్టెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.కేజీయఫ్ సీరిస్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియెన్స్లో భారీ హైప్ నెలకొంది. సెప్టెంబర్ 28న ఇండియా వైడ్గా పలు భాషలలో భారీ ఎత్తున సలార్ రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు కేజీయఫ్ 2కు లింక్ ఉంటుందని తాజాగా వినిపిస్తోన్న సమాచారం. ఓ బొగ్గు గనిలో పనిచేసే ఓ మాస్ గ్యాంగ్ లీడర్ గతంలో పనిచేసే తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఇతర క్రిమినల్ గ్యాంగ్స్ను ఎలా చంపేశాడు ? అన్న కథాంశంతోనే ఈ సినిమా ఉంటుందట.
లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లాగానే ఇది ప్రశాంత్ మల్టివర్స్గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో మోస్ట్ వయలెంట్ మ్యాన్ అయిన సలార్… గతంలో తన బెస్ట్ ఫ్రెండ్ రాఖీ బాయ్కు చనిపోయేముందు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు సలార్గా మారతాడట.
ఈ సలార్ ఆ బొగ్గు గనిలో ఉన్న క్రిమినల్స్ను ఎలా మట్టుబెట్టాడు… వారినుంచి పేద ప్రజలకు ఎలా విముక్తి కల్పించాడన్న కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రభాస్కు జోడీగా శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా రు. 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది.