వ‌ర్మ‌కు కూడా జై బాల‌య్య కిక్కు ఎక్కేసింది… ఏం చేశాడో చూడండి…!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ 20 సంవత్సరాల తర్వాత ప్రతి సంవ‌త్స‌రం అమెరికాలో జరిగే నాటా వేడుకకి వెళ్ళిన‌ విషయం అందరికీ తెలిసిందే. రాంగోపాల్ వర్మ ఏ ట్రిప్‌కు వెళ్లినా ఆయన ఎంజాయ్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా రాంగోపాల్ వర్మ తాను ఎలా ?ఎంజాయ్ చేస్తున్నానో ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెన్సేషనల్ గా మారాడు.

ఈ ట్రిప్‌పై వ‌ర్మ స్పందిస్తూ ముందుగా నాటా నిర్వాహకులు నా అమెరికా ట్రిప్ ఎంతో హ్యాపీగా ఉండేలా చేశారు.. అమెరికా అంటే నాకు ఎంత ఇష్టం.. అలాగే అమెరికాకు కూడా నేనంటే ఎంతో ఇష్టమని చివరగా నా డ్రీమ్ అయిన డల్లాస్ లో బేబీ డాల్స్ పబ్ కి వెళ్లాన‌ని అంటూనే అక్కడ ఎంతో ఆనందంగా ఉందని ఆయన పోస్టుల్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా అక్కడ పబ్ లో ఉన్న హాట్ హాట్ అమ్మాయిలతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.

ఇదే స‌మ‌యంలో అమెరికా వెళ్లిన రాంగోపాల్ వర్మ దగ్గర నుంచి జై బాలయ్య అనే స్లోగన్ కూడా వచ్చింది. అమెరికాలో ఉండే తెలుగువారు ఆనందంగా సంబరాలు చేసుకుంటోన్న ఓ ప్రదేశంలో వర్మ టపాసులు కాల్చాడు. అక్కడ ఆ షార్ట్స్ పేలుతూ ఉండగా జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. వర్మ తన శత్రువు అయిన బాలకృష్ణ పేరును పలకటం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎప్పుడు బాలయ్య, చంద్రబాబు టిడిపి పై విరుచుకుపడే రాంగోపాల్ వర్మలో ఒక్కసారిగా ఈ మార్పు ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తున్నారా ? అంటూ అందరూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.