అద్భుతమైన స్టెప్పులు వేస్తూ ఇండియన్ మైకల్ జాక్సన్గా పేరొందాడు ప్రభుదేవా. సినిమా కెరీర్లో దర్శకుడిగా, నటుడిగా, ఇంకా ప్రొడ్యూసర్గానూ ఈ డ్యాన్స్ మాస్టర్ రాణిస్తున్నాడు. ఇప్పటికే తన ప్రతిభతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. అయితే ప్రభుదేవా ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నా పర్సనల్ లైఫ్ మాత్రం మొదటినుంచీ అసలు బాగోలేదు. ముఖ్యంగా అతని మ్యారేజ్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుగులు ఎదురయ్యాయి.
మొదట ప్రభుదేవా తన తండ్రి మాట కాదని ముస్లిం అమ్మాయి రమాలత్ ని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చాడు. ఇలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే అతని జీవితంలోకి నయనతార వచ్చింది. ఆమెకు ప్రభుదేవా దగ్గరయ్యాడు. ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను నయనతార కోసం వదిలేయడానికి కూడా సిద్ధమయ్యాడు. విడాకుల కోసం భార్యతో ప్రభుదేవా పెద్ద యుద్ధమే చేసాడు. చివరికి ఆమె నుంచి విడాకులు తీసుకోగలిగాడు కానీ నయనతారని పెళ్లి చేసుకోలేదు.
అనంతరం ప్రభుదేవా మిల్కీ బ్యూటీ తమన్నాతో కూడా రెండేళ్లు రిలేషన్ కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి. నయనతార నుంచి బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆపై అమీ జాక్సన్తో కూడా ప్రభుదేవా ప్రేమాయణం నడిపించినట్లు మీడియా వర్గాలు వార్తలు రాశాయి. సినిమా అవకాశాల కోసమే వీరి మధ్య రిలేషన్ నడిచినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇక ప్రభుదేవా కరోనా సమయంలో కూడా ఒక అఫైర్ పెట్టుకున్నాడు. వెన్నెముకకు సంబంధించిన సమస్యతో ఫిజియోథెరపీ సెంటర్లో చేరిన ఈ డ్యాన్స్ మాస్టర్ డాక్టర్ హిమానీ సింగ్తో పరిచయం పెంచుకున్నాడు.
ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ప్రభుదేవాతో కలిసి ఆమె ఈ మధ్య ఒక ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అలా 50 ఏళ్ల వయసులో ప్రభుదేవా తండ్రి అయి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఈమెతో కలిసి బిడ్డను కన్న తర్వాత తన జీవితం పరిపూర్ణమైందంటూ ప్రభుదేవా కామెంట్ చేశాడు. మొత్తం మీద ఈ నటుడు చాలామందితో అఫైర్ పెట్టుకుని చివరికి ఒక డాక్టర్ తో సెటిల్ అయ్యాడు.