ఆడ‌ప‌డుచు నిహారిక కోసం లావణ్య త్రిపాఠి ఇంత పెద్ద త్యాగం చేసిందా… హ్యాట్సాఫ్‌..!

సినీ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హాట్ టాపిక్ అయ్యారు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే ఇటలీలో వీరి వివాహం జరుగుతుందని టాక్ నడుస్తోంది. వీరితో పాటు మరొకరి స్టోరీ కూడా హాట్ టాపిక్ గా మారింది. అదే నిహారిక – చైతన్యల మధ్య గొడవ. ఇదేంటి సడెన్ గా ఈ టాపిక్ వచ్చింది అనుకుంటున్నారా? నిజమే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి ఈ విషయానికి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా టైంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్ ఉంది. అప్పుడే వీరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. అయితే అప్పుడే నిహారిక – చైతన్యల మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో లావణ్య ముందు నిహారిక – చైతన్యల కాపురం నిలబెట్టాలని, ఆ తరువాత వరుణ్ తో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

అంతే కాదు వారిద్దరిని కలపడానికి చాలా ప్రయత్నాలు కూడా చేసారంట. గొడవలు సర్ధుమనిగి ఇద్దరు సంతోషంగా ఉన్న తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. నిహారిక – చైతన్యను కలపడానికి లావణ్య ఏడాది ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్ల ఇక లావణ్య – వరుణ్ ఇద్దరు కూడా ఈ ఏడాది వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు.

ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే గతేడాదే వీరి వివాహం జరిగేదని తెలుస్తోంది. అయితే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి క్లారిటీ ఇవ్వకపోయినా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనీ వార్తలు వస్తున్నాయి. ఇక లావణ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు చైతన్య రాకపోవడంతో వీరిద్దరి విడాకులు నిజమేనంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.