ప్రభాస్ – కృతిసనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ విశేషాలేంటో చూద్దాం.
1- ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో ఈ సినిమా టిక్కెట్ రేట్లు రు. 2000 – 2250 రేంజ్లో పలుకుతున్నా ఈ సినిమా చూసేందుకు ఆసక్తితో ఉన్న ప్రేక్షకులు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. టిక్కెట్ రేటు ఎంత ఉన్నా కొనేస్తున్నారు.
2- ప్రపంచ వ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ మాత్రం 1500 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది. మిగిలిన భాషలు 4 వేలు, ఓవర్సీస్లో 3500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
3- గతంలో ఏ సినిమాకు లేని విధంగా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమా టిక్కెట్లు వేల సంఖ్యలో కొని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
4- ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఆంజనేయస్వామికి ఓ సీటు కేటాయిస్తున్నారు.
5- ఆదిపురుష్ టిక్కెట్ రేట్లను ఏపీ, తెలంగాణలో రు. 50 పెంచినా ఎగబడి మరీ కొంటున్నారు.
6- తెలంగాణలో ఫస్ట్ డే అదనపు షోలకు పర్మిసన్లు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే షోలు స్టార్ట్ అయ్యాయి.
7- రామాయణంపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఆదిపురుష్ ఏకంగా రు. 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కడం విశేషం.
8- తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రి రీలీజ్ ఈవెంట్ కు ఏకంగా రు. 2 కోట్లు ఖర్చు చేశారు.
9- రు. 500 కోట్లతో తెరకెక్కించిన ఆదిపురుష్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ను ఏకంగా రు. 250 కోట్లు ఖర్చు చేశారు.
10- రెండు తెలుగు రాష్ట్రాల ఈ సినిమా రైట్స్ను పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా రు. 185 కోట్లకు దక్కించుకుంది.