తెలుగు సినీ అభిమానులు, మెగాభిమానులు, పవర్ స్టార్ అభిమానులు గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న సినిమా బ్రో ది అవతార్. పవన్ కళ్యాణ్, మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు మెగా హీరోలు నటిస్తోన్న మెగా మల్టీస్టారర్ సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా సెన్షేషనల్ అవుతుందనే అందరూ భావిస్తున్నారు.
ఇక మెగాభిమానులు అయితే ఈ సినిమా ఖచ్చితంగా టాలీవుడ్లో సెన్షేషనల్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలు, ఆశలతో ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి హార్ట్ పగిలిపోయే న్యూస్ బయటకు వచ్చింది. బ్రో సినిమాను ఇప్పటికే ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. టీజర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరో వైపు బ్రో సినిమాకు ఏపీ, తెలంగాణలో రు. 90 కోట్ల రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని కూడా అంటున్నారు. ఈ టైంలో ఉన్నట్టు ఉండి సడెన్గా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. ఓ వైపు ఏపీలో ఉన్న పొలిటికల్ హీట్ నేపథ్యంలో పవన్ అటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.స
ఇటు డబ్బింగ్ పూర్తయ్యాక ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ పూర్తి చేసి ఈ నెల 28న రిలీజ్ చేయడం సాధ్యం కాదన్న నిర్ణయానికి నిర్మాతలు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. మూడు వారాలు గ్యాప్ తీసుకొని బ్రో విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా బ్రో వాయిదా వార్తలతో మెగాభిమానులు డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు.