‘ బ్రో ‘ సినిమాకు రిలీజ్‌కు ముందే పెద్ద దెబ్బ‌… బ‌లైపోయేది ఎవ‌రంటే…!

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ బ్రో విడుదల ఎంతో దూరంలో లేదు. ఇంకో 17 రోజుల్లో బ్రో మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రమోషన్ పరంగా ఒక టీజర్ , లిరిక్స్ వీడియో తప్ప ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. సాంగ్ లో “ఇంట్లో ఆపు దుమ్ము లేపు” అంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు పవన్.. కానీ ఈ సినిమాలో పవన్ పాత్ర కొద్దిసేపే ఉంటదని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28న రిలీజ్ డేట్ వచ్చింది.. కానీ ఏ హడావిడి కనిపించడం లేదు.

దీనితో బ్రో సినిమా మీద విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్రో సినిమాకు మరో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. రు. 100 కోట్లకు పైగా థియేట్రికల్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగుతోన్న ప‌వ‌న్ తాజాగా ఏపీలో వాలంటరీ మీద వ్యాఖ్యలతో పాటు వైయస్సార్సీపి ప్రభుత్వం మీద చేస్తున్న తీవ్ర విమర్శలు అధికార పార్టీని అసహనానికి గురి చేస్తున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం ప‌వ‌న్ సినిమాపై క‌న్నెర్ర చేస్తే ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు.

అలాగే ఈ సినిమాను మాములు రేట్లకే టికెట్లు అమ్మాలని ఒత్తిడి తేవొచ్చు. ఇదింకా తేలిందో లేదో కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం బ్రో ఏపీ బిజినెస్‌ పెద్ద చర్చకే దారి తీసింది. ఒక‌వేళ టిక్కెట్ రేట్లు త‌గ్గించినా, ఏపీలో ప్రీమియ‌ర్ షోలు లేక‌పోయినా ఈ సినిమా భారీ రేట్ల‌కు కొన్న‌వాళ్లంతా బ‌లైపోవాల్సిందే. బ్రో సినిమా పేరుకు ఫ్రెండ్షిప్ డ్రామా అయినా..టీజర్ లో పొలిటికల్ పంచులు కనిపిస్తున్నాయి.

టీజర్ లో జనసేన పార్టీ గుర్తు గ్లాస్ కూడా కనిపించింది. దాంతోపాటు డైలాగ్స్ కూడా బలంగానే ఉన్న‌ట్టు ఉన్నాయి. బ్రో సినిమాకి స్క్రీన్ ప్లే మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ గత ఏడాది వచ్చిన భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే మాటలు రాశారు.