వైసీపీ నుంచి ప‌రుచూరి అవుట్‌… ఫ్యాన్ రివ‌ర్స్‌లో తిరుగుతోంది…!

రాష్ట్రంలో అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి..ఇప్పటివరకు అధికార బలంతో హడావిడి చేసినా సరే..ఇప్పుడు ప్రజలు వైసీపీని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు..అటు సొంత పార్టీ నేతలు సైతం వైసీపీని వదులుతున్నారు. దీంతో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ(దివిసీమ)లో వైసీపీకి ఊహించని దెబ్బలు తగులుతున్నాయి.

తెలుగు తాజా వార్తలు | Telugu Latest News - My City Hyderabad

అక్కడ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన సానుభూతి, జనసేన ఓట్లు చీల్చడం వాళ్ళ 2019 ఎన్నికల్లో సింహాద్రి వైసీపీ నుంచి గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన ప్రజల సమస్యలని పట్టించుకున్నది లేదు..అభివృద్ధి లేదు. దివిసీమలో రోడ్లు దారుణంగా ఉన్నాయి.

నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయడం లేదు. మారుమూల ప్రాంతాలకు తాగునీరు, రోడ్ల సౌకర్యం లేదు. ఇటు పన్నుల భారం వల్ల ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది. ఈ పరిణామాలు ఎమ్మెల్యేకు బాగా మైనస్ అవుతున్నాయి. ఇదే సమయంలో సొంత పార్టీ వాళ్ళు సైతం ఎమ్మెల్యేని వ్యతిరేకించే పరిస్తితి. ఇటీవలే వైసీపీ కీలక నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్ పార్టీకి రాజీనామా చేశారు.

Mandali Buddha Prasad - Wikipedia

గత ఎన్నికల్లో సింహాద్రి గెలుపుకు పరుచూరి కృషి చేశారు. ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో వైసీపీకి ఆధిక్యం తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన వైసీపీని వీడారు. దీంతో ఎమ్మెల్యేకు భారీ దెబ్బ తగిలినట్లు అయింది. ఇటు టి‌డి‌పి నుంచి మండలి బుద్ధప్రసాద్ బలం పెరుగుతూ ఉంది. కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన సపోర్ట్ ఉంటేనే ఓట్లు చీలకుండా ఉంటాయి. పొత్తు ఉంటే సీటు ఎవరికి దక్కిన వైసీపీకి మాత్రం చెక్ పడటం ఖాయం.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, ysrcp