నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది. గత రెండు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగా అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సార్ సినిమా ప్రమోషన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎవరు ఊహించని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు హీరో గణేష్. ఇప్పుడు ఇదే టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. మోక్షజ్ఞ ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.. అతి కొద్ది రోజుల్లోనే వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పాడు. అంతేకాకుండా మోక్షజ్ఞ తన తండ్రి బాలకృష్ణ లాగా భారీ డైలాగులు సైతం గుక్కతిప్పకుండా చెపుతాడని కూడా గణేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అలాగే గణేష్.. మోక్షజ్ఞ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నాడు. మోక్షజ్ఞలో చాలా టాలెంట్ ఉంది.. తన రెండు కనుబొమ్మలతో కూడా నటించగలడు.. మేము ఇద్దరం కలిసి రామ్చరణ్ నటించిన రచ్చ సినిమాకు వెళ్ళినప్పుడు బాలయ్య కొడుకు రామ్ చరణ్ సినిమాకు వచ్చాడంటూ గట్టిగా అరిచారు.. కచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే సంవత్సరంలోపు ఉంటుందంటూ బెల్లంకొండ గణేష్ తెలిపాడు. ఏదేమైనా మొత్తానికి బెల్లంకొండ చెప్పిన మాటలతో నందమూరి ఫ్యాన్స్కు గూస్బంప్స్ మోత మోగిపోతోంది.
టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ బాలయ్య డైరెక్షన్ చేయబోయే ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. బాలయ్య కూడా తన తండ్రి ఎన్టీఆర్ తనను ఎలా హీరోగా పరిచయం చేశాడో అలాగే తన తనయుడు మోక్షజ్ఞ ను కూడా టాలీవుడ్లోకి సెన్షేషనల్గా ఎంట్రీ చేయించాలని భావిస్తున్నాడు. అందుకే ఏ విషయంలోనూ బాలయ్య రాజీపడడం లేదు.