Akkineni : ఆ డైరక్టర్ కథకి ఫిదా.. నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్ ఫిక్స్..!

అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్.. కింగ్ నాగార్జున Akkineni  అఖిల్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. ఆల్రెడీ నాగార్జున నాగ చైతన్యతో కలిసి మనం, బంగార్రాజు సినిమాలు చేశాడు. కానీ అఖిల్ తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఒకటి రెండు కథలు అంతకుముందు అనుకున్నా అవి అంతగా సెట్ అవలేదు అందుకే వదిలేశారు. ఇక లేటెస్ట్ గా వీరిద్దరి మల్టీస్టారర్ మూవీగా ఓ కథ వచ్చిందట.

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని డైరెక్ట్ చేస్తున్న మోహన్ రాజా నాగ్, Akkineni అఖిల్ కోసం ఓ అద్భుతమైన కథ రాశారట. ఈమధ్యనే నాగార్జునని కలిసి కథ కూడా చెప్పారట. నాగ్ కి కథ బాగా నచ్చేసిందట. ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాతో నాగార్జున, ఏజెంట్ సినిమాతో అఖిల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తి కాగానే త్వరలోనే ఈ మల్టీస్టారర్ సెట్ చేస్తారని తెలుస్తుంది.

నాగార్జున మెచ్చాడు అంటే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే లెక్క. గాడ్ ఫాదర్ హిట్ అయితే మాత్రం మోహన్ రాజాతో అఖిల్, నాగార్జున మల్టీస్టారర్ సినిమా ఫిక్స్ అయినట్టే లెక్క. మరి ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది.

Tags: Akhil, Akkineni Multistarrer, godfather, Megastar Chiranjeevi, Mohan Raja, nagarjuna, Tollywood