ఆసియాలోనే నెంబర్ వన్ సంపన్నవేత్త ముకేశ్ అంబానీ కుటుంబంలో అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తన భార్య నీతా అంటే ముఖేష్కు ఎంతో ప్రేమ. ఆమె కోసం ముంబైలో నిర్మించిన ఖరీదైన భవనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కుటుంబంలో చిన్న కార్యక్రమం కోసం కూడా కోట్లకు కోట్లు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 10 ఏళ్ల క్రితం ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ 50వ పుట్టినరోజు వేడుక అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.
అసలు ఈ పుట్టినరోజు వేడుకకు పెట్టిన ఖర్చు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. రు. 220 కోట్ల రూపాయలతో ఈ పుట్టినరోజు జరిపారు. రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఉన్నత స్థాయి రిసార్ట్లో నీతా అంబానీ 50వ పుట్టినరోజు వేడుక జరిపి ముకేశ్ అంబానీ ట్రెండ్ సెట్ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకలు మొత్తం రెండు రోజులపాటు జరిగాయి.
ఈ వేడుకల కోసం చాలా ఖరీదైన ఉమేద్ ఫ్యాలెస్ మొత్తం బుక్ చేశారు. నవంబర్ 1 2013 న జరిగిన ఈ పుట్టినరోజుకు మొత్తం 250 మంది ముఖ్య అతిధులు హాజరయ్యారు. రిలయన్స్ గ్రూప్ యాజమాన్యం 32 చార్టర్డ్ విమానాల ద్వారా విలాసవంతమైన రిసార్ట్ కు అతిథులు చేరుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుక నవంబర్ 1న ప్రారంభమైంది. ఆకాశం మిరుమిట్లు గొలుపే లైట్లు పుట్టినరోజు అమ్మాయి నీతా పేరు ఉచ్చరించాయి.
240 పైగా అతిధుల లిస్ట్ లో మిట్టల్స్, మహీంద్రా, బిర్లా, గోద్రెజ్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ ఇంకా రాణి ముఖర్జీ వంటి పలువురు వ్యాపారవేత్తలతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఇక రెండు రోజుల పాటు ప్రియాంక చోప్రా, ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.