టాలీవుడ్ నటుడు విష్ణు మంచు జిన్నాలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది. టైటిల్ విషయంలో ఎంత కాంట్రవర్సీ అయిందో తెలిసిందే . ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ మరియు సన్నీ లియోన్ కథానాయికలుగా నటించారు.
ఈరోజు ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఇధే స్నేహం పేరుతో పాటను రిలీజ్ చేశారు.ఈ పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా మంచు మరియు వివియానా మంచు పాడారు .అనూప్ రూబెన్స్ ట్రాక్ కంపోజ్ చేయగా, భాస్కర్ భట్ల సాహిత్యాన్ని రాశారు. ఈ పాట రిలీజ్ అయిన వెంటనే హిట్ అయిపొయింది .
ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ చిత్రంపై భారీ బజ్ క్రియేట్ చేసింది.