SSMB28 : మహేష్ నిర్ణయం వాళ్లకి మింగుడు పడట్లేదా..?

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రం తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. SSMB28 సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ ఆలోచన మానుకోవాలని నిర్మాతలకు మహేష్ చెప్పాడట. త్రివిక్రం సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ అంటే పెద్దగా రిస్క్ కాకపోవచ్చు కానీ మహేష్ మాత్రం రాజమౌళి సినిమాతోనే నేషనల్ వైడ్ సత్తా చాటాలని చూస్తున్నాడు.

అందుకే త్రివిక్రం సినిమాని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని అంటున్నాడట. ఓ పక్క నిర్మాతలు మహేష్ 28 (SSMB28) వ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేసి ఓవర్సీస్ లో 20 కోట్ల దాకా బిజినెస్ చేయాలని చూస్తున్నారట. దీనికి మహేష్ ఏమాత్రం ఒప్పుకోవట్లేదని టాక్.

అయితే ఓ పక్క స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తుంటే ఇంకా మహేష్ తెలుగు మార్కెట్ మీదే ఆధారపడటం ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంది. రాజమౌళి సినిమా కన్నా ముందు త్రివిక్రం సినిమాతో పాన్ ఇండియా ట్రయల్ వేస్తే ఆ సినిమాకి లైన్ క్లియర్ అయినట్టు ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags: Harika Hassini, mahesh, SSMB28, Superstar Mahesh, Tollywood, trivikram