టీడీపీ అధినేత ఎన్టీఆర్… పార్టీ పెట్టి ప్రచారం చేసిన కొత్తలో… ఆయన నిర్వహించిన సభలకు పెద్ద ఎత్తు న ప్రజలు క్యూ కట్టేవారు. వీరిని చూసి అన్నగారు.. నింగి వంగిందా.. నేల ఈనిందా.. అని వ్యాఖ్యానించే వారు. అప్పట్లో ఈ డైలాగులే.. ప్రధాన పత్రికల్లో శీర్షికలుగా వచ్చేవి. అయితే.. ఆ తర్వాత.. ఇలాంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు పార్టీ యువ నాయకుడు.. నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు మాత్రం స్పందన అలానే ఉంది.
వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా.. యువ నాయకుడు నారా లోకేష్ యు వగళం పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర 66వ రోజుకు చేరుకుంది. అనంతపురంలో కొనసా గుతోంది. జనవరి 27న అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన ఈ యువగళం యాత్ర.. ఇంతింతై.. అన్నట్టు గా జోరుగా ముందుకు సాగుతుండడం గమనార్హం. ఇక, ఈ యాత్రలో `సెల్ఫీ విత్ లోకేష్` కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పాదయాత్ర ప్రారంభానికి గంట ముందు రోజూ.. స్థానిక టీడీపీ కేడర్తో పాటు.. యువత, ప్రజలతో నారా లోకేష్ సెల్ఫీ దిగుతున్నారు. తద్వారా.. యువతకు మరింత చేరువ కావడంతోపాటు వారి జీవితంలోనూ ఒక మధుర స్మృతిగా ఉంటుందని.. పార్టీ ఈమేరకు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతంఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన సెల్పీ విత్ లోకేష్ దుమ్మురేపింది.
నారా లోకేష్తో సెల్ఫీ దిగేందుకు.. జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలతెలవారుతూనే.. వేలాది మం దిగా నారాలోకేష్ బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు.. క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఈ క్యూలు కూడా కిలో మీటరు దూరం వరకు విస్తరించాయంటే.. ఆశ్చర్యం వేస్తుంది. అయినా కూడా ఇది వాస్తవం. ఇక, తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చినవారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్న నారాలోకేష్ వారితో ఫొటో దిగి పంపిస్తున్నారు.