ఈ సినిమాతో ఆమె ప్రేక్షకుల మదిలో నిజంగానే సావిత్రిగా నిలిచిపోయింది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా కీర్తి సురేష్ ని వరించింది. అలాంటి కీర్తి సురేష్ నాని సరసన దసరా సినిమాతో పాన్ ఇండియా మూవీలో కూడా నటించింది.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి విషయంపై కీర్తి సురేష్ తల్లి అయిన సీనియర్ నటీమణి మేనక ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా జనాలు మాత్రం ఆమెను నమ్మడం లేదు. ఇటీవల కీర్తి సురేష్ ఒక వ్యక్తితో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పటి ఆమె ప్రేమలో పడింది అని.. తనకు కాబోయే వాడిని అందుకే పరిచయం చేసిందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై ఈ రోజు కీర్తి సురేష్ తండ్రి సురేష్ కూడా స్పందించారు. ఈ మేరకు కేరళ బీజీపీ నాయకురాలు శోభ సురేంద్రన్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో లో ఈ విధంగా చెప్పుకొచ్చారు. నా కూతురు కీర్తి ఒక అబ్బాయితో లవ్లో ఉందని.. త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ కొట్టి పడేశారు.
కీర్తి సురేష్ పక్కన ఉన్న ఆ అబ్బాయి పేరు ఫర్హాన్.. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంతేకానీ వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం లేదు. ఒకవేళ మా అమ్మాయి పెళ్లి గనుక చేసుకుంటే మీడియాకి అభిమానులకి మేమే ముందుగా చెప్తాం, అంతేకానీ ఇలా లేనిపోని ప్రచారాలు చేస్తే మా కుటుంబం ఇబ్బంది పడుతుందంటూ కీర్తి పెళ్లిపై వస్తున్న పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పెట్టాడు హీరోయిన్ తండ్రి.