జ‌గ‌న్‌ నీతులు… మ‌రి ఇప్పుడు స్క్రిఫ్ట్ రివ‌ర్స్ అయ్యిందే..!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం…ఈ సూత్రం రాజకీయాల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఏ నాయకుడైన రాజకీయాల్లో ఒక సమయంలో గెలుపు చూసిన మరొక సమయంలో ఓటమిని చూడక తప్పదు. ఇక గెలుపుని ఎలా తీసుకుంటారో..అదేవిధంగా ఓటమిని తీసుకోవాలి. రెండిటినీ సమానంగా చూడాల్సిందే. అలా కాకుండా గెలిచినప్పుడు ఏమో తమకు తిరుగులేదని, ఓడినప్పుడు అది పెద్ద ఓటమి కాదని..దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే ఎదురుదెబ్బలు తప్పవు.

Dileep Reddy Article On AP Legislative Council - Sakshi

ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీకి అదే జరుగుతుంది. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తుంది. ఇక వైసీపీ గెలుస్తుంది.. ఏంటి అనేది పక్కన పెడితే..మొత్తానికి వన్ సైడ్ గా గెలుస్తూ వస్తుంది. అలా గెలుస్తుండటంతో ప్రజలంతా తమ పక్కనే ఉన్నారనే ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీకి ఎక్కువైంది. అదే సమయంలో ఊహించని విధంగా మూడు పట్టభద్రుల స్థానాల్లో వైసీపీకి ఊహించని ఓటమి ఎదురైంది. టి‌డి‌పి గెలిచింది.

కానీ దాన్ని వైసీపీ తక్కువ చేసి చూపించింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీకి షాక్ ఇచ్చారు. అనూహ్యంగా టి‌డి‌పి ఒక సీటు గెలుచుకుంది. అయినా సరే ఈ గెలుపుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అదేమంటే చంద్రబాబు ప్రలోభాలు పెట్టి తమ ఎమ్మెల్యేలని లాక్కున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు అంటున్నారు. అంటే ఓ రకంగా వైసీపీ నేతలు నీతులు చెబుతున్నారు..ఆ నీతులు జనం నమ్మే పరిస్తితి లేదు.ఎందుకంటే అదే టి‌డి‌పి నుంచి నలుగురుని , జనసేన నుంచి ఒక ఎమ్మెల్యేని వైసీపీ లాక్కుంది. మరి దాన్ని ఏం అంటారో వైసీపీ వాళ్లే చెప్పాలి.

2024 would be my last election if not voted to power, says Chandrababu Naidu

వారిని చూసుకుంటే 7 ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్ధులని నిలబెట్టి..సొంత వాళ్లే రివర్స్ అయ్యే సరికి ఒక స్థానం కోల్పోయారు. పైగా పంచాయితీ, పరిషత్, మున్సిపల్, పరిషత్..తిరుపతి ఎంపీ ఉపఎన్నిక, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచిందో అందరికీ తెలిసిందే. పథకాలు పోతాయని ఓటర్లని ప్రలోభ పెట్టడం, బెదిరింపులు, దొంగ ఓట్లు..అబ్బో ఒకటి ఏంటి చాలానే చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే..తాము ఏ నిర్ణయం తీసుకున్న అసెంబ్లీలో ఆమోదంవచ్చిన మండలిలో ఆమోదం వచ్చేది కాదు..ఎందుకంటే అక్కడ టి‌డిపీకి మెజారిటీ ఎక్కువ. అందుకే మండలి రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. కానీ ఆ ప్రక్రియ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్సీలు దక్కుతుండటంతో..అన్నీ సీట్లు గెలిచేయాలనే ఆశతో ముందుకెళుతున్నారు. ఇన్ని చేసి వైసీపీ నీతులు చెబితే ఉపయోగం ఉండదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, tdp, telugu news, viral news, YS Jagan, ysrcp