స్టార్ ప్రొడ్యూసర్ పీటర్ పాల్ ఇటీవల అనారోగ్య కారణంతో మరణించారన్న విషయం అందరికీ తెలుసు. దీంతో వనిత మూడు మూడో భర్త మృతి అని చాలా వార్త పత్రికలు న్యూస్ ప్రింట్ చేశాయి. వనిత విజయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ పీటర్ పాల్ నా భర్త కాదని.. ఆమె పీటర్ ను న్యాయబద్ధంగా వివాహం చేసుకోలేదని ఇప్పటివరకు పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా వద్దనే ఆలోచనతో ఆగిపోయానని .. అయితే మీడియా సంస్థల వేస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని న్యూస్ ఛానల్ పై ఉన్న గౌరవంతోనే ఈ విషయం చెబుతున్నానని వనిత అంది.
పీటర్ పాల్ తో నాకు అఫీషియల్ గా మ్యారేజ్ జరగలేదని అతను నా భర్త కాదని.. 2020 లో కొంతకాలం మేమిద్దరం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న మాట నిజమేనని అయితే అది ఆ సంవత్సరమే ముగిసిందని మా ఇద్దరికీ అప్పటినుంచి ఎటువంటి సంబంధం లేదని.. ఇకపై నైనా వనిత విజయ్ కుమార్ మూడో భర్త చనిపోయాడు అంటూ వార్తలు రాయడం ఆపండి.. అంటూ తన ట్విట్టర్ వేదికగా వనిత చెప్పుకొచ్చింది.
నాకు భర్త లేడు.. ఆ విషయంలో ఎటువంటి బాధ లేదని ట్విట్టర్ వేదికగా మిస్ వనిత విజయ్ కుమార్ అని తాజాగా ట్విట్ చేసింది వనిత. విరిద్దరు 2020లో జూన్ 27న క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. రిలేటివ్స్ అందరి ముందు వెస్ట్రన్ సిస్టమ్లో వీరు ఒకరినొకరు కిస్ చేసుకున్న ఫొటోస్ అప్పట్లో బాగా వైరల్ గా మారాయి. వనిత తమిళ్ బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. చాలా సీరియల్లో నటించింది.
వనిత ప్రొడ్యూసర్ పీటర్ పాల్ 2020లో వివాహం చేసుకున్నారని సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపించడంతో పెళ్లై భార్య ఉన్న పీటర్ అంతకుముందే ఇద్దరు భర్తలను వదిలేసిన వనితను పెళ్లి చేసుకోవడం ఏంటని.. వాడు అసలు మగాడు కాడని.. ఇలా చాలామందిని నెటిజన్స్ ఘాటుగా విమర్శలు చేస్తూ పీటర్ ను ట్రోల్ చేస్తారు.
వీరి పెళ్లి చట్టబద్ధం కాదని పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ కోర్టులో కేస్ కూడా వేసింది. వీరు ఏడాది తిరిగేసరికి కొన్ని పర్సనల్ కారణాలతో విడిపోయారు. అప్పట్లో వనిత పేరు వార్తల్లో బాగా వినిపించేది. వనిత ప్రస్తుతం నటుడు నరేష్ నటిస్తున్న మళ్లీ పెళ్లి అనే సినిమాలో అతని రెండో భార్య రోల్ లో యాక్ట్ చేస్తుంది.