రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ బలాన్ని తట్టుకుని నిలబడి పోరాడుతూ వస్తున్న చంద్రబాబుకు ప్రజా మద్ధతు పెరుగుతుంది. టిడిపి నేతలు పోరాటానికి ఫలితం కనిపిస్తుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో టిడిపి బలపడింది. ముఖ్యంగా రాజధాని అమరావతి ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపికి బలం ఎక్కువ కనిపిస్తుంది. ఈ సారి ఇక్కడ టిడిపి సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది.
అయితే దాదాపు అన్నీ సీట్లలో టిడిపి బలపడింది గాని..రెండు సీట్లలో మాత్రం వెనుకబడే ఉంది. జిల్లాలో 17 సీట్లు ఉంటే వాటిల్లో 15 సీట్లలో టిడిపికి బలం కనిపిస్తుంది..ఆధిక్యత ఉంది. ఇక జనసేనతో పొత్తు ఉంటే 15 సీట్లు గెలవడం సులువే. కానీ పొత్తు ఉన్నా సరే మాచర్ల, నరసారావుపేట లాంటి సీట్లలో గెలవడం కష్టమనే పరిస్తితి. ఈ రెండు చోట్ల టిడిపి గెలుపుకు దూరమై 20 ఏళ్ళు దాటింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో రెండు చోట్ల టిడిపి చివరిగా గెలిచింది.
ఇంకా అక్కడ నుంచి టిడిపి ఒక్కసారిగా కూడా గెలవలేదు.ఇక గత రెండు ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది.అటు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా గెలుస్తున్నారు. ఇటు పేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గెలుస్తున్నారు. అయితే మాచర్లలో టిడిపి తరుపున జూలకంటి బ్రహ్మానందరెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు.
చాలావరకు పార్టీ బలాన్ని పెంచారు…అయినా సరే వైసీపీని దాటలేని పరిస్తితి. ఇంకా టిడిపి వెనుకబడే ఉంది. అటు నరసారావుపేటలో టిడిపి ఇంచార్జ్ గా చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు..ఈయన అంతగా పార్టీని బలోపేతం చేయలేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కనిపిస్తున్నారు. ఇలా రెండు స్థానాల్లో టిడిపి వెనుకబడి ఉంది. ఈ సారి ఎన్నికల్లో కూడా గెలవడం కష్టమనే పరిస్తితి.