పాద‌యాత్ర‌లో లోకేష్‌ను సీక్రెట్‌గా క‌లిసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌… అధికార పార్టీలో గుబులు..!

ఏపీలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం తర్వాత వైసిపి నేతల్లో గుబులు రేగుతున్న మాట వాస్తవం. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యే ప‌లువురు గీత దాటేందుకు కూడా సాహసిస్తున్నారు. గీత దాటిన క్రమంలోనే నలుగురు ఎమ్మెల్యేలను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

 

అయినా కూడా పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడా ? వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి రహస్యంగా లోకేష్ ను కలిసినట్టు టిడిపి సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం జరుగుతోంది. పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నారు.

ఆయన పై టిడిపి నుంచి పోటీ చేసిన కంచర్ల శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు. తన అనుచరుడిగా ఉన్న శ్యాం ప్రసాద్ రెడ్డి ఉన్నత స్థానానికి వెళ్లడం ఇష్టం లేకే మంత్రి కాకాణి.. ఎన్నిక‌ల వేళ‌ సైలెంట్ అయ్యారని ఇదే ఆయన ఘోరంగా ఓడిపోవడానికి కారణమైందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే యువ‌గళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తో శ్యాంప్రసాద్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది.

అయితే తాను టిడిపి నుంచి ఏమీ ? ఆశించడం లేదని.. పార్టీ కోసం పని చేస్తానని లోకేష్ తో శ్యామ్‌ ప్రసాద్ చెప్పినట్టు ఒక సందేశం వైరల్ అవుతుంది. పార్టీకి ఎంతో నమ్మకంగా ఉండే శ్యాం ప్రసాద్ రెడ్డి లోకేష్ ను ఎందుకు ? కలిశారు అసలు ఎవరి ద్వారా లోకేష్‌ను కలిశారు అన్నదానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూపి లాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై సీఎం వర్గాలు సైతం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp