పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన సినిమా బ్రో. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెరుగుతుంది. తమిళ్ డైరెక్టర్, యాక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రోడ్యుసర్గా తెరకెక్కన్నుంది. ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతంకి రీమేక్గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ రేంజ్కి తగ్గట్టుగా డైలాగ్స్ మార్చి కొన్ని మార్పులతో ఈ సినిమాను రూపొందించాడు సముద్రఖని. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్, ఫస్ట్లుక్ రిలీజై మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫస్ట్ సాంగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా తాజాగా సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజై ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్లో పూర్తిగా సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ రొమాన్స్ అదిరిపోయింది. ఈ పాటకి తమన్ మెలోడీ మ్యూజిక్ అందించారు. ఇక తేజ్, కేతికాల కెమిస్ట్రీ యూత్ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. జాహ్నవులే నెరజాణవులే అంటూ సాగే ఈ సాంగ్ కి కాసర్ల శ్యామ్ లిరిక్స్ చేకూర్చగా.. తమన్ గాయని ప్రణతితో కలిసి ఈ పాటను పాడాడు. సాయిధరమ్ తేజ్ , కేతికల మధ్యన రొమాన్స్ లవ్ తెలిపేలా ఈ సాంగ్ ఉంది. దర్శకుడు సముద్రం కానీ విదేశాల్లో మంచి లొకేషన్స్ లో ఈ సాంగ్ ని షూట్ చేశాడు.
ఇక ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాయి ధరంతేజ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమా రిలీజై పవన్, తేజ్ కెరీర్ లోనే దబిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుందని మూవీ టీం భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా మేనల్లుడిలో ఇంత మేటర్ ఉందా అంటూ.. తేజ్ రొమాన్స్ తోనే కుమ్మేస్తున్నావుగా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్స్.