2014లో 45 వేలు… 2019లో 54 వేల మెజార్టీతో వైసీపీ గెలిచిన సీట్లో టీడీపీ విన్ అవుతుందా…!

కడప అంటేనే వైసీపీ కంచుకోట అనే పరిస్తితి. అసలు కడప వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోటగా ఉందనే చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు జగన్..వైసీపీ హవా నడుస్తోంది. ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. ఉమ్మడి కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంపై వైసీపీకి పట్టు కనిపిస్తుంది.

Cuddapah Station Pics - Railway Enquiry

 

అయితే నిదానంగా కొన్ని స్థానాల్లో కాస్త పట్టు తప్పుతుంది..కానీ మెజారిటీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా ఉంది. ఇదే సమయంలో కడప టౌన్‌లో వైసీపీకి ఆధిక్యం ఉంది. కానీ ఒకప్పుడు కడప సిటీలో టి‌డి‌పి సత్తా చాటింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో కడప సిటీలో టి‌డి‌పి గెలిచింది. కానీ 2004 నుంచి వైఎస్సార్ హవా నడుస్తోంది. వైఎస్సార్ హవా వల్ల 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక తర్వాత జగన్ హవా తో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

అది కూడా వైసీపీ భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తుంది. 2014లో 45 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి అంజాద్ బాషా గెలవగా, 2019 ఎన్నికల్లో 54 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే కడప టౌన్ లో వైసీపీ బలం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రతి ఎన్నికకు కొత్త ఓటర్లు వస్తుంటారు..కడప టౌన్ లో కొత్తగా వచ్చే ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే కడప యువత జగన్ వైపు ఉన్నారు. అయితే అక్కడ ఓటర్లని టి‌డి‌పి ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది.

S.b. Amzath Basha – Deputy C.M.- Minister of Minority Affairs, Andhra  Pradesh.

అయితే లోకేష్ పాదయాత్ర వల్ల కాస్త మార్పు రావచ్చు గాని..కడప సిటీలో మాత్రం వైసీపీ గెలవడం అసాధ్యమనే పరిస్తితి. మంత్రి అంజాద్‌పై వ్యతిరేకత ఉన్నా సరే టి‌డి‌పికి ఉపయోగం లేదు. మొత్తానికి కడప సిటీపై టీడీపీ ఆశలు వదులుకున్నట్లే.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp