ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ హీరోలు, హీరోయిన్లు లగ్జరీ వస్తువులు కొనడం మామూలే. అందులో ఖరీదైన కారులను స్టార్ హీరోలు, హీరోయిన్లు బాగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే రీసెంట్ గానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఖరీదైన కారును కొనుగోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇక పాన్ ఇండియా హీరో, మన టాలీవుడ్ యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఖరీదైన కార్లు వరుసగా కొనుగోలు చేస్తోన్నాడు.
ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఓ ఖరీదైన కార్ కొనుగోలు చేసి ఆ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ కూడా ఓ ఖరీదైన కార్ను కొనుగులు చేసింది. బాలీవుడ్లో ఈమె విక్కీ డోనర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ లాంటి సినిమాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యామీ తాజాగా బీఎండబ్ల్యూ ఎక్స్7 లగ్జరీ కారును కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని కార్లను విక్రయించే డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. యామీ గౌతమ్ కొనుగోలు చేసిన వాటిలో ఖరీదైన లగ్జరీ కారుగా నిలవనుంది. యామీ కొనుగోలు చేసిన ఈ బీఎండబ్ల్యూ కారు విలువ దాదాపు రూ.1.24 కోట్లుగా ఉంటుంది. యామీ గౌతమ్ గ్యారేజీలో ఇది మూడో లగ్జరీ కారుగా ఉండనుంది. ఆమెకు ఇప్పటికే ఆడి ఏ4, ఆడి క్యూ7 మోడల్ కార్లు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే ఇప్పుడు కొన్న కారు అత్యంత ఖరీదైన కారు అని తెలుస్తుంది.