వచ్చే యేడాది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగే వేళ దేశ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మణిపూర్ అంశం దేశాన్ని ఎలా కుదిపేస్తుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటమి పట్టుబట్టింది. ఈ క్రమంలోనే విపక్ష కూటమి ‘ఇండియా’.. కేంద్ర ప్రభుత్వంపై ‘అవిశ్వాస తీర్మాన’ అస్త్రం ప్రయోగించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.
లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కార్యాలయానికి నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై తెలంగాణలో అధికార పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఖమ్మం భారాస ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో కేసీఆర్ .. దాదాపు రాహుల్తో చేతులు కలిపినట్టే అయ్యింది.