ఉమ్మడి ఏపీ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి కుమార్తె కుమారుడు విజయ్చందర్. ఈయన చాలా ఉన్నత చదువు చదువుకున్నారు. ఇంజనీర్గా కూడా పనిచేశారు. అనూహ్యంగా సినిమా వైపు మళ్లారు. రెండు మూడుసినిమాల్లో నటించినతర్వాత..సొంతగా సినిమాలుచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కొంటె అల్లుడు అనే తొలిసినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే.. ఈ సినిమా ఫ్లాప్ అయింది.
మరో సినిమా చేశారు. అది కూడా విఫలమైంది. దీంతో అప్పటి వరకు ఉన్న సొమ్మంతా అయిపోయింది. మరోవైపు.. విజయ్చందర్.. స్నేహాల కారణంగా.. ఆయనకు వ్యసనాలు అబ్బాయి. ముఖ్యంగా పేకాట ఆయనను మరింతగా బాధించింది. దీనిని వదులుకోలేక.. కొనసాగించలేక ఇబ్బంది పడ్డారని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. అన్నగారు నటించిన పాండురంగ మహత్యం సినిమా చూసిన… తర్వాత..తాను కూడా అదే రేంజ్లో ఒక సినిమా చేయాలని అనుకున్నారు.
అయితే.. హిందూ పౌరాణిక కథలు అప్పటికే అనేక సినిమాలుగా వచ్చేశాయి. దీంతో ఏసుప్రభు జీవిత చరిత్రను సినిమాకు ఎక్కిస్తే.. ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని హీరో కృష్ణకు చెప్పారు.ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పులు చేసి ఈ సినిమాకు ప్రాణం పోయాలని అనుకున్నారు. కానీ, నటులు సహకరించలేదు. అమ్మో..అని తప్పుకొన్నారు. ఎందుకంటే.. గతంలో తీసిన సినిమాలు ఫెయిల్ కావడం ప్రధాన కారణం.
ఇదే విషయాన్ని కృష్ణకు చెప్పగానే.. ఆయన ఆ బాధ్యత తీసుకుని.. అందరికీఫోన్లు చేసి.. ఈ సినిమా హిట్ అవుతుంది. నన్ను నమ్మండి అని హామీ ఇచ్చాఆరు. అప్పటికీ కొందరు వెనుకాడారు. దీంతో కృష్ణ.. ఈ సినిమా ఫ్లాప్ అయితే..నా సినిమాల్లో మీకు అవకాశం ఇస్తాను. మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో నటులు ఒప్పుకొన్నారు. కరుణామయుడు సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.