సిగ్గూ, నీతిలేనోళ్లు అంటూ రానా, త్రివిక్ర‌మ్‌పై ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ సంచ‌ల‌న ట్వీట్‌..!

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ అంటేనే మనకు భారీ భారీ సినిమాలు గుర్తుకు వస్తాయి. మహేష్ బాబుతో ఒక్కడు, సైనికుడు, చిరంజీవితో మృగరాజు లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించిన ఘనత గుణశేఖర్‌దే. ఆ తర్వాత అనుష్క, రానా, బన్నీ కాంబినేషన్లో వచ్చిన రుద్రమదేవి సినిమాతో గుణశేఖర్ కం బ్యాక్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత సమంత ప్రధాన పాత్రలో తరకెక్కించిన శాకుంతలం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా దెబ్బతో గుణశేఖర్ మళ్ళీ పాతాళంలో పడిపోయాడు.

ఇది ఇలా ఉంటే గుణశేఖర్ డిం డ్రీమ్ ప్రాజెక్టులలో హిరణ్యకశ్య‌ప ఒకటి. ఈ సినిమా ఏళ్ల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అసలు ఈ ప్రాజెక్టు లేట్ అవ్వడంతోనే గుణశేఖర్ దానిని పక్కన పెట్టి సమంతతో శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఇక ఇప్పుడు గుణశేఖర్ హిరణ్యకశ్య‌ప సినిమాను పట్టించుకునే వారే లేరు. ఈ సినిమాను రానాతో తెరకెక్కించాలని అనుకున్నాడు గుణశేఖర్. అయితే ఇప్పుడు రానా హిరణ్యకశ్యప సినిమాకు త్రివిక్రమ్ కథ‌ అందిస్తున్నట్టుగా ప్రకటించడంతో ఈ సినిమా నుంచి గుణశేఖర్‌ను తీసేసినట్టు చెప్పకనే చెప్పేశాడు.

దీనిపై గుణశేఖర్ రానా, త్రివిక్రమ్ పేర్లు చెప్పకుండానే పరోక్షంగా విమర్శలు చేశారు. మీ స్టోరీకి దేవుడిని ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు.. ఆ దేవుడు మీలో ఉన్న చిత్తశుద్ధిని కూడా గమనిస్తూనే ఉంటాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.. అనైతిక చర్యలకు నైతిక విలువలతో జవాబు చెప్పే రోజు కచ్చితంగా వస్తుంది అంటూ గుణశేఖర్ సంచలన ట్వీట్ చేశాడు.

ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో ఇది రానా, త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చేసిందే అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తాను ఎంతో కష్టపడి హిరణ్యకశ్య‌ప‌ సినిమా కథను తయారు చేసుకున్నానని.. ఇప్పుడు రానా తనతో కాకుండా త్రివిక్రమ్ తో ఈ సినిమా ఉందని ప్రకటించడానికి సిగ్గు, నీతి లేదా అంటూ గుణశేఖర్ ఫైర్ అవుతున్నాడని నేటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.