మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తన మొదటి సినిమాతోనే తన నటనతో మెగా అభిమానులు మెప్పించి మెగాస్టార్కు తగ్గ కొడుకుగా అనిపించుకున్నాడు రామ్ చరణ్. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో మెగా పవర్ స్టార్ గా మారాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.
ఈ సినిమా ఆరోజుల్లోనే ఏకంగా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో రాజమౌళి, రామ్ చరణ్ ను రెండు డిఫరెంట్ యాంగిల్స్లో చూపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటించింది. మగధీరలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా చిన్న పాత్రలో నటించాడు. తండ్రి కొడుకులను ఓకే ఫ్రేమ్లో చూసిన మెగా అభిమానులు సైతం ఎంతో ఆనందించారు.
అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో చిరంజీవి చేసిన రోల్లో ఆయన నటించలేదట. ఆదే సమయంలో ఇతర విషయాలతో బిజీగా ఉన్న చిరంజీవిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక రాజమౌళి మరో నటుడుతో చిరంజీవికి డూప్ గా చేయించారట. ఆ నటుడు మరి ఎవరో కాదు ప్రభాస్ శీను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ శీను చిరంజీవిని బాగా ఇమిటేట్ చేస్తూ ఆయన లాగే ప్రవర్తించే వారట.
ఇక అదే సమయంలో రాజమౌళి ప్రభాస్ శీను తోనే చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారట. ఇదే విషయని ప్రభాస్ శ్రీను కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ కు పాప పుట్టడంతో ఆయకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.