పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమా గత శుక్రవారం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం రూ. 400 కోట్ల గ్రాస్ మార్క్ వసూల్లు క్రాస్ చేసిన ఆదిపురుష్ వసూళ్లు వీక్డేస్లో బాగా డ్రాప్ అయ్యాయి. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, జానకీగా కృతి సనన్ నటించారు. మిగిలిన పాత్రల్లో దేవదత్త నాగే, సన్నీ సింగ్ మరియు సైఫ్ అలీ ఖాన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. వీక్ డేస్ నుంచి ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమా మేకర్స్ ప్రేక్షకుల కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఆదిపురుష్ సినిమా చూసే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఆదిపురుష్ యొక్క 3డి వెర్షన్ టిక్కెట్ రేట్లు భారీగా తగ్గించేశారు. వచ్చే రెండు రోజులకు రూ. 150 రూపాయలకు పరిమితం చేశారు. ఇది ఇప్పటి వరకు సినిమా చూడని ప్రేక్షకులకు, ఫ్యామిలీలకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఈ బంపర్ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్తించదు.
మేకర్స్ హిందీ బెల్ట్ ప్రేక్షకులకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారు. వీక్డేస్లో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేందుకు.. డ్రాఫ్ అయిన కలెక్షన్లను పెంచుకునేందుకు ఈ ఆఫర్ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హనుమంతుడు పాత్రకు చెప్పిన డైలాగులపై కాంట్రవర్సీ రావడంతో మేకర్స్ వాటిని మ్యూట్ చేస్తామని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.