తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పెద్దగా గుర్తింపు తెచ్చుకొని నటి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై కనిపిస్తూ ఎంతో భారీ ఫాలోయింగ్తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఆ నటీమణి ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్ రీచాకు తల్లిగా నటించి… ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. అసలు సోషల్ మీడియాలో ఆమె అందం, ఆమె ఫాలోయింగ్ ముందు తెలుగులో స్టార్ హీరోలు కూడా సాటి రాలేరు.
ప్రస్తుతం వెండితెరపై బుల్లితెరపై కూడా నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. ఇంతకీ అందమైన నటి ఎవరా ?అని అనుకుంటున్నారా..! ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అయిన మామిళ్లపల్లి శైలజా ప్రియ. పెళ్లయిన తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైన ఈమె.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే సినిమాల్లో అవకాశాలతో పాటు బుల్లితెరపై అవకాశాలు కూడా వచ్చాయి. వాటిలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది.
ఇప్పుడు ప్రియ గురించి నిజం చెప్పాలంటే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు కంటే ఇప్పుడే ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది. 40 + ఏజ్లో ఆమె అందచందాలు, ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటినెన్స్ చూస్తుంటే కుర్రకారుకు హీరోయిన్లను చూసినకిక్ కంటే ఎక్కువ కిక్ వస్తుంది. అందరికీ వయసు పెరుగుతుంటే ముసలితనం వస్తూ ఉంటుంది.. ఈమెకు మాత్రం రివర్స్లో ఆమె వయసుతో పాటు అందం కూడా పెరుగుతుంది.
ప్రియ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.. హీరోయిన్లకు సమానమైన అందంతో దూసుకుపోతున్న ఈమె ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులను రోజురోజుకీ పెంచుకుంటుంది. ప్రియాకు సోషల్ మీడియాలో 1.1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉండటం మరో విషయం. హీరోయిన్లకు మించి తన అందంతో ఈ హాట్ ఆంటీ దూసుకుపోతుంది.
సాధారణంగా సోషల్ మీడియాలో లక్షల ఫాలోయింగ్ కోసం టాప్ నటీనటులే నానా తంటాలు పడుతుంటారు. వారందరినీ దాటుకొని ఈమె ఇంతమంది ఫాలోవర్స్ ని ఎలా పెంచుకుందా ? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం మాత్రం ఆమె అందంతో పాటు ముఖ్యంగా తన నవ్వు అని అంతా అనుకుంటున్నారు. ప్రతిరోజూ తన బ్యూటిఫుల్ సెల్ఫీలతో పాటు.. రకరకాల ఫోటోలు అప్లోడ్ చేయడం వల్ల ఈమెకు బోలెడంత ఫాలోయింగ్ వచ్చిపడిందని చెబుతున్నారు.