టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న సినిమాలలో మహేష్ – రాజమౌళిల సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన లేదు. అయినా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు రాకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు గురించి భారీ రేంజ్ లో పబ్లిసిటీ జరుగుతుంది. మరీ మూఖ్యంగా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి.
గ్లోబల్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ ఓ వార్త వైరల్గా మారింది. అంతేకాకుండా ఇప్పటివరకు మనం మహేష్ బాబు ని మహా అయితే క్లాస్.. మాస్ లుక్ లో మాత్రమే చూసాం. అయితే ఇప్పుడు రాజమౌళి సినిమాలో మాత్రం ఓ డిఫరెంట్ యాక్షన్ జోనర్లో మహేష్ ఎలా ఉంటారు అని రాజమౌళి సినిమా ద్వారా చూపించబోతున్నారట. ఈ సినిమా మొత్తం షూటింగ్ కూడా అడవుల్లోనే జరుగుతుంది. ఇక ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చిన సరే అది ఓ పెద్ద తుఫాన్ లా మారిపోతోంది. రోజురోజుకూ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ అంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం వాటిపై ఎప్పుడు స్పందించట్లేదు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యుస్ వైరల్గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను విలన్ గా తీసుకుంటున్నారంట.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ రావాలంటే అమీర్ అయితేనే సెట్ అవుటాడు అని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే ఆయన్ను ఈ సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారట. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించిన దీపికా పదుకొణెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోబోతున్నారు అంటూ మరో వార్త బయటకు వచ్చింది.
ఇక రాజమౌళి ఇదంతా హాలీవుడ్లో తన మార్కెట్ పెంచుకోవడం కోసం చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు టాప్ స్టార్లను తీసుకుంటే ఈ సినిమాకు ఆటోమేటిక్గా మార్కెట్ వస్తుందని రాజమౌళి భావిస్తున్నారట. ఇప్పటికే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో చర్చలు కూడా జరపగా ఆయన ఒకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది.ఇక దీపికా కూడా ఒప్పుకునేలా ఉందట. ఇదే నిజమైతే మహేశ్ బాబు మూవీ ఎక్కడికో వెళ్లిపోతుంది..!!