మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఆరేళ్ల కోరిక తీర్చ‌బోతోన్న బాల‌య్య‌… క‌న్‌ఫార్మ్ చేసేశాడు…!

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “భగవంత్ కేసరి”. వ‌రుస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్ దుమ్ము దులుపుతోంది. ఈ సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న హైప్‌ను ఈ టీజ‌ర్ ఒక్క దెబ్బ‌తో డ‌బుల్ చేసేసింది.

ఈ సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు కూడా..! బాల‌య్యకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ మొదటి సారిగా హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఇప్పుడు బాలయ్య నెక్ట్స్‌ ప్రాజెక్ట్ హీరోయిన్ పై కూడా అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రీసెంట్‌గానే బాల‌య్య 109వ ప్రాజెక్ట్‌ను మేక‌ర్స్ ఎనౌన్స్ చేశారు.

సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ నిర్మించే ఈ ప్రాజెక్ట్‌కు కొల్లి బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. బాబి ఈ సంక్రాంతికి వ‌చ్చిన చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక బాల‌య్య – బాబి సినిమాలో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ త‌మ‌న్నాను తీసుకోవాల‌ని దాదాపు ఫిక్స్ అయిపోయిన‌ట్టు స‌మాచారం. ఎప్పుడో ఆరేళ్ల క్రిత‌మే త‌మ‌న్నా బాల‌య్య గారితో ఓ సినిమా చేయాల‌ని ఉంద‌న్న కోరిక వ్య‌క్తం చేసింది.

అయితే ఇప్పుడు బాల‌య్య త‌మ‌న్నా కోరిక‌ను నెర‌వేర్చ‌బోతున్నాడు. బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న త‌న 109వ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. అప్పుడెప్పుడో బాలయ్య సార్ గ్రేట్‌.. ఆయ‌న‌తో నటించాల‌ని ఉంద‌ని చెప్పిన త‌మ‌న్నా కోరిక ఎట్ట‌కేల‌కు ఇప్పుడు నెర‌వేర‌బోతోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంది.