జబర్దస్త్ షోలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. తర్వాత బలగం సినిమాతో టాలీవుడ్కి డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వేణు ఈ సినిమాకి చాలా అవార్డులను కూడా దక్కించుకున్నాడు. చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ ప్రజలకు ఓ రేంజ్లో కనెక్ట్ అయ్యింది.
చాలా రోజుల తర్వాత తెలంగాణ పల్లె ప్రజానీకం ఈ సినిమాను వీథి తెరల్లో వేసుకుని మరీ గుంపులు గుంపులుగా చూశారు. ఇక ప్రస్తుతం వేణు మరో సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యాడట. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట సినిమాలాగే ఈ సినిమా కూడా సింపుల్ గా ఉండాలని కసరత్తులు చేస్తున్నాడట.
బలగం సినిమా రేంజ్ లో ఇది ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో వేణు మంచి కాన్సెప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కూడా హీరోగా ప్రియదర్శినే తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందట.