Anasuya : అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. అనసూయ టార్గెట్ ఎవరు..?

జబర్దస్త్ యాంకర్ అనసూయ తను అనుకున్న విషయాన్ని డైరెక్ట్ గా చెప్పడంలో ఏమాత్రం సందేహించదు. టాలీవుడ్ హీరో రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ అంటే అనసూయ (Anasuya)కి మొదటి నుంచి కొద్దిగా ఇబ్బందే. అర్జున్ రెడ్డి ఈవెంట్ లో మన హీరో మాట్లాడిన తీరుని అనసూయ అప్పట్లో తప్పుబట్టింది. అయితే అనసూయ డైరెక్ట్ గా కాకుండా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విజయ్ దేవరకొండని టార్గెట్ చేసింది. అయితే విజయ్ ఫ్యాన్స్ అనసూయని ఆడేసుకున్నారు.

అయితే ఆ వ్యవహారం ముగిసింది కదా అని అనుకుంటున్న టైం లో మరోసారి అనసూయ (Anasuya) తన ట్వీట్ తో విజయ్ ఫ్యాన్స్ ని నిద్రలేపింది. ఇంతకీ అనసూయ ఏమని ట్వీట్ చేసింది అంటే అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కొన్నిసార్లు రావడం లేటవ్వొచ్చు కానీ రావడం మాత్రం పక్కా అంటూ హ్యాష్ ట్యాగ్ నాట్ హ్యాపీ ఆన్ సం వన్ సాడ్నెస్.. బట్ ఫైత్ రీ స్టోర్ద్ అంటూ పెట్టింది.

విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా రిలీజ్ అవగా సినిమాకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సినిమాలో విషయం ఏమి లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే అనసూయ ఈరోజే సడెన్ గా ఫైత్ గురించి కామెంట్ పెట్టడంపై ఇది ఆమె విజయ్ ని టార్గెట్ చేస్తూ చేసిందే అని ఫిక్స్ అవుతున్నారు. అనసూయ గురించి విజయ్ ఎప్పుడూ నోరు తెరవకపోవడం విశేషం.

Tags: anasuya, Jabardasth, Jabardasth Show, liger, puri jagannath, Vijay Devarakonda