యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాధేశ్యామ్ తర్వాత రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. బాలీవుడ్లో తానాజీ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించారు. టీ సీరిస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించే చర్చ జరుగుతోంది. అసలు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు ? ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత ? ఈ సినిమాలో నటించిన నటీనటులకు ఎంతెంత రెమ్యునరేషన్లు ఇచ్చారన్న అంశాలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
ఈ సినిమాను రు. 500 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ తీశారు. తొలుత రు. 400 కోట్లు బడ్జెట్గా ఈ సినిమాకే కేటాయించారు. అయితే గ్రాఫిక్స్ మరి నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో మరో రు. 100 కోట్లు అదనంగా కేటాయించారు. ఇక రాముడిగా నటించిన ప్రభాస్కే రు. 150 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇది ఆల్ ఇండియా రికార్డ్గా బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
ఇక లంకేశ్గా నటించిన సైప్ ఆలీఖాన్కు రు. 12 కోట్లు, సీత పాత్రలో నటించిన కృతిసనన్కు రు. 3 కోట్లు ఇచ్చారని టాక్ ? లక్ష్మణుడిగా నటించిన సన్నీసింగ్కు రు 1.5 కోట్లు, ఇక సూర్ఫణఖ పాత్రలో చేసినట్టుగా తెలుస్తోన్న సోనాల్ చౌహాన్కు రు. 50 లక్షలు ఇచ్చారంటున్నారు. హనుమాన్గా చేసిన దేవదత్త నాగే, డైరెక్టర్ ఓం రౌత్కు ఎంత ఇచ్చారన్నది మాత్రం బయటకు రావడం లేదు. కేవలం పారితోషకాలకే రు. 180 – 200 కోట్లు ఖర్చయ్యాయంటున్నారు.