టాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పెట్టింది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మంచు మనోజ్ హీరోగా నటించాడు. తాప్సి మొదటి సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు ఆమె అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలు అందరి సరసన సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న తాప్సి తర్వాత బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇలా చాలా కాలం పాటు టాలీవుడ్కు దూరం అయింది. బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోన్న తాప్సీకి
ఇప్పటికీ బాలీవుడ్ లో అదే క్రేజ్ ఉంది.. అంతే బిజీగా ఉంది.
వరుస అవకాశాలు వస్తోన్న టైంలోనే తాప్సి టాలీవుడ్ కి దూరం కావడానికి ఓ కారణం ఉందన్న టాక్ అప్పట్లో బయటకు వచ్చింది. తాప్సి టాలీవుడ్ సినిమాలలో నటించే సమయంలో ఒక స్టార్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడిపిందట. కొంతకాలం వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన తరువాత ఆ స్టార్ హీరో కొడుకు తాప్సికి హ్యాండ్ ఇచ్చి వదిలేసాడట.
అలా ఆ హీరోతో లవ్ బ్రేకప్ అయిన తాప్సీ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉందని.. ఆ తర్వాత తాను మోసపోయిన టాలీవుడ్లో ఆ హీరో ముందే ఉండడం ఇష్టం లేక బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎంత ? నిజం ఉందో తెలియదు గానీ తాప్సి అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ హీరోయిన్ మళ్ళీ తెలుగులో కనిపిస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు.