నందమూరి హీరో నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న తారకరత్న కేవలం 40 సంవత్సరాల చిన్న వయసులోనే అర్ధాంతరంగా తనువు చాలించటం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. తారకరత్న అకాల మరణం నందమూరి అభిమానులు.. తెలుగు ప్రజల్లోనూ ఎంతో తీరని ఆవేదన కలిగించింది. మిగిలిన వాళ్ళకి తారకరత్న మరణం అంత బాధ కలిగించింది అంటే ఇక తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, తారకరత్న పిల్లలు ఎంత బాధ పడుతూ ఉంటారో చెప్పక్కర్లేదు.
భర్త చనిపోయి ఇన్ని రోజులు అవుతున్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ తారకరత్న జ్ఞాపకాలలోనే జీవిస్తోంది. తన భర్తతో తాను గడిపిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. తమ జీవితంలో ఎదురైన ఇబ్బందులు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి భర్తను తలుచుకుంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయింది. పిల్లలతో తారకరత్న గడిపిన క్యూట్ మూమెంట్స్ షేర్ చేస్తూ.. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నా… అంటూ తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది.
ఈ వీడియో చాలా ప్రతి ఒక్కరి మనసులను హత్తుకునేలా ఉంది. ఇది చూసిన నెటిజెన్లు మాకే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి కష్ట సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి అంటూ అలేఖ్య రెడ్డికి చెబుతున్నారు. ఇక జనవరి 27న టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అదే రోజు గుండెపోటుతో కుప్పకూలారు. ఆ తర్వాత ఆసుపత్రిలో 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఇక తారకరత్న – అలేఖ్య రెడ్డి దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు.
View this post on Instagram