గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏది అంటే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పేది మెగా డాక్టర్ డివర్స్ న్యూస్ . మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి . గత 48 గంటల నుంచి వార్తలు వినిపిస్తున్న సరే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు .అంతేకాదు అటు జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కూడా విడాకుల విషయంపై ఇప్పటికి స్పందించలేదు .
అయితే జొన్నలగడ్డ చైతన్య మాత్రం నిహారికతో పెళ్లి జరిగిన ఫోటోస్ ని తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు. అంతేకాదు ఇద్దరినీ ఒకరు ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు . ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక డివర్స్ కన్ఫర్మ్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అయితే ఇంత జరుగుతున్న సరే ఏమాత్రం రెస్పాండ్ అవ్వని మెగా డాటర్ నిహారిక ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టుకు వచ్చింది . కొత్త సంవత్సరం కొత్త అనౌన్స్మెంట్ అంటూ అభిమానులకు సరికొత్త క్రేజీ అప్డేట్ ను రివీల్ చేసింది .
సోషల్ మీడియాలో తన విడాకుల వార్తలు వైరల్ అవుతున్న ఏ మాత్రం పట్టించుకోని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అప్ అయింది . డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రోమో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మెగా డాటర్ నిహారిక. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్ నిహారిక నిర్మించి, నటిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో నిహారిక విడాకుల వార్త వైరల్ అవుతుంటే చలనం లేకుండా నిహారిక ఇలా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం పై మెగా ఫాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు . అంతేకాదు నిహారిక విడాకులు కన్ఫామ్ అని అందుకే ఆ విషయాన్ని అనౌన్స్ చేయలేక ఇలా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయాన్ని బయట పెట్టిందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది..!!
View this post on Instagram