ప్రేక్షకులను అలరించడానికి కోట్ల కొద్దీ బడ్జెట్ అవసరం లేదు వాళ్లని మెప్పించగలిగే కంటెంట్ ఉంటే చాలు ఇది సీతారామం తో మరోసారి ప్రూవ్ అయ్యింది. అద్భుతమైన ప్రేమ కావ్యంగా సీతారామం (Sitharamam) సినిమా వచ్చింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల జోడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే సీతారామం హిట్ అవడంతో 300 కోట్ల బడ్జెట్ తో లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాపై పంచులు వేస్తున్నారు.
రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్దే జంటగా వచ్చిన సినిమా రాధేశ్యామ్. యువి క్రియేషన్స్ వారు ఆ సినిమా కోసం 300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. అయితే ఆ సినిమా అనుకున్నంత విధంగా సక్సెస్ అవలేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన సీతారామం సినిమా చూసిన ఆడియెన్స్ 40 కోట్ల బడ్జెట్ తో తీసిన సీతారామం లవ్ స్టోరీ బాగుంది 300 కోట్లు పెట్టి తీసిన రాధేశ్యామ్ ఫెయిల్ అయిందని అంటున్నారు.
అయితే ఏ కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంత పెడతారు. అయితే కొన్నిసార్లు అనుకున్న రేంజ్ లో సినిమా సక్సెస్ అవకపోతే మాత్రం ఇలాంటి కామెంట్స్ వస్తాయి. రాధేశ్యామ్, సీతారామం (Sitharamam) అసలేమాత్రం పొంతలేని సినిమాలు కాబట్టి రెండిటిని పోల్చి చూడకుండా ఉంటే బెటర్.