బ్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవంతంగా ముగిసింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో ఒక విషయం బాగా చర్చకి వస్తోంది. బ్రో సినిమాకు కర్త, కర్మ, క్రియ అవడంతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు అందించిన మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఫంక్షన్కు రాలేదు. త్రివిక్రమ్ ఏం చెప్తే పవన్ అది చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ గీసిన బిరిలోనే పవన్ ఉంటున్నాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే.
అలాంటి పవన్ సినిమాకు.. అందులోనూ అన్నీ తానై వెనక ఉండి నడిపించిన సినిమా ఫంక్షన్కు త్రివిక్రమ్ ఎందుకు ? రాలేదు అన్నది ఇప్పుడు రకరకాల చర్చలకు తావిచ్చేలా ఉంది. త్రివిక్రమ్ ఇటీవల తాను డైరెక్ట్ చేస్తున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు.. పవన్ సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగులు సమకూర్చటం.. పవన్ కు కొత్త సినిమాలు సెట్ చేయడం లాంటి విషయాలపై బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారన్న చర్చలు అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే గుంటూరు కారం కంటే కూడా బ్రో సినిమాను ఎలా ?కంప్లీట్ చేయాలి బ్రో సినిమాను ఎంత ? త్వరగా రిలీజ్ చేయాలి… బ్రోను ఎలా హిట్ చేయాలి ? అనేదానిపైనే త్రివిక్రమ్ ఎక్కువగా కసరత్తురు చేశాడని కూడా ఇండస్ట్రీ గుసగుస. అందుకే మహేష్ సైతం త్రివిక్రంపై ఇప్పటికే రెండు మూడు సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా టాక్. త్రివిక్రమ్ సరిగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరోయిన్ తో పాటు ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్లు కూడా తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ కారణంతోనే బ్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ వచ్చి హైలెట్ గా మాట్లాడితే.. ఇప్పటివరకు వచ్చిన అనుమానాలు నిజం అయ్యేలా ఉంటాయన్న సందేహంతోనే త్రివిక్రమ్ ఈ ఫంక్షన్కు కావాలని డుమ్మా కొట్టాడని అంటున్నారు. అటు మహేష్ బాబు ఇచ్చిన వార్నింగ్ లు కూడా బాగా పనిచేశాయని అందుకే త్రివిక్రమ్ బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని అంటున్నారు.