టాలీవుడ్ అందాల హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గత రాత్రి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలలో మహేష్ బాబు ఎంతో స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా కూల్ లుక్ లో కనిపించాడు. అంతేకాకుండా ఆ ఫోటోలో చూడటానికి ఎంతో సరదాగా కూడా ఉన్నాయి. మరి ప్రధానంగా మహేష్ బాబు ఆ ఫోటోలలో ఎంతో హైలెట్ గా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఆ ఫోటోలో మహేష్ కూతురు సితారతో కలిసి వెళ్లిన పార్టీ ఇదేనంటూ సోషల్ మీడియాలో నమ్రత సైతం ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
ఇంతకీ ఈ సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎవరి పార్టీకి వెళ్లారు..? ఆ పార్టీకి అక్కినేని హీరో అఖిల్ కు సంబంధం ఏంలో ఒకసారి చూద్దాం. మహేష్ తన కుటుంబంతో వెళ్లిన పార్టీ ప్రముఖ డిజైనర్ శ్రీయ భూపాల్ శ్రీమంతం వేడుకలు అన్నట్లుగా తెలుస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనందిత్ రెడ్డితో 2018 జులై 6న ఈమె పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి టాలీవుడ్కు సంబంధించిన ఎందరో స్టార్ హీరోలు హాజరయ్యారు.
అయితే ఇప్పుడు ఈ శ్రీయ భూపాల్ మరెవరో కాదు. గతంలో అక్కినేని అఖిల్ తో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పెళ్లి వరకు వెలబోతుందన్న వీరి బంధం అక్కడితో ఆగిపోయింది. అయితే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత అఖిల్ మాత్రం మళ్లీ పెళ్లి అనే మాట ఎత్తటం లేదు. ఎలా అయినా తన కెరీర్లు ఓ భారీ హిట్ అందుకోవాలని సినిమాలు చేస్తూ వెళ్లిపోతున్నాడు.
కానీ అఖిల్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న శ్రీయ భూపాల్ మాత్రం తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుని ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తుంది. ఈ ఫంక్షన్ కి మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. ఇక అక్కడ మహేష్ ఎంతో క్యూట్ లుక్స్ తో అందరి మతులు పోగొట్టేసాడు. ప్రస్తుతం ఈ అందాల నటుడు తన 28వ
సినిమా గుంటూరు కారంను త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో తన 29వ సినిమా చేయబోతున్నాడు.