ఛలో సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా తొలి సినిమాతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుని లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మరింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించి పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టింది.
ఈ సినిమాతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇదే సమయంలో పుష్ప లాంటి భారీ హిట్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన విజయం దక్కలేదు.. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు దీంతో ఈ ముద్దుగుమ్మ భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం రష్మిక మందన చేతిలో పుష్ప2 తో పాటు సందీప్ వంగా – రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్న యానిమల్ వంటి పలు సినిమాల్లో నటిస్తుంది.
ఇప్పుడు ఇదే సమయంలో రష్మిక క్రేజీ సీక్వెల్లో ఛాన్స్ కొట్టేసింది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన విక్రమార్కుడు సినిమాకు ఈ సీక్వల్ గా వస్తున్న సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది.. టాలీవుడ్ లో వస్తున్న సినిమా కాదండోయ్.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన రౌడీ రాథోడ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చే మూవీలో రష్మిక హీరోయిన్గా సెట్ అయింది.
ఈ రౌడీ రాథోడ్ సినిమాను ప్రభుదేవా అక్షయ్ కుమార్ ను హీరోగా పెట్టి తెరకెక్కించాడు.. ఇప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలో మీరు ఈ సినిమా వస్తుందంటే పప్పులో కాలువేసినంటే.. షాహిద్ కపూర్ హీరోగా ఈ సీక్వెల్ రాబోతుంది.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ సంజయ్లీలా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి బాలీవుడ్ లో నిలదొక్కుకో లేక ఇబ్బంది పడుతున్న ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాతో అయినా భారీ హీట్ వస్తుందో లేదో చూడాలి..?