ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా అంటూ వెంపర్లాడుతున్నారు. అయితే మన స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ విషయంలో కథలు, సోషల్ మీడియా ఫాలోయింగ్, వారి స్టైల్ విషయంలో వారి భార్యల గైడెన్స్లు, స్ట్రాటజీలు కూడా చాలా వరకు యూజ్ అవుతున్నాయి. ఉదాహరణకు త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయ్యారు.
పుష్ప సినిమాతో బన్నీకి పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో చూశాం. ఇప్పుడు అందరూ పుష్ప 2 మానియాలో నేషనల్ లెవల్లో ఎదురు చూస్తున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కంటే రామ్చరణ్కే ఎక్కువుగా గ్లోబల్ రేంజ్ ఇమేజ్ వచ్చింది. ఇందుకు తగినట్టుగా చరణ్ తనకు తాను, అటు వెనక నుంచి ప్రమోట్ చేసిన తీరు చాలా బాగుంది.
ఇక తమ భార్యలకు కేవలం సినిమా పరంగానే కాకుండా… ఇతర విషయాల్లో క్రేజ్ పెరిగేలా చేయడంతో పాటు వారి సినిమాలకు మార్కెట్ పెరిగేలా చేయడం, సోషల్ మీడియా స్ట్రాటజీలు చూడడం, ఫాలోయింగ్ పెంచేలా చేయడం.. మారుతున్న ట్రెండ్కు తగ్గట్టుగా దుస్తులను ఎంపిక చేయడం ఇలా రకరకాల విషయాల్లో చరణ్, మహేష్ భార్యలు ముందున్నట్టు ఉన్నారు.
మహేష్బాబు సినిమాల విషయంలో నమ్రత ఇన్వాల్మెంట్ మామూలుగా ఉండదు. ఇది శ్రీమంతుడు నుంచి ఎక్కువుగా ఉంటోంది. మహేష్ రెమ్యునరేషన్లు, కథలు ఎంపిక చేసుకోవడం, అటు మార్కెట్ పెరిగేలా చేయడం, ఇటు రెమ్యునరేషన్ పెంచేలా చేయడం ఇలా చాలా విషయాలు నమ్రత డీల్ చేస్తూ భర్తను బాగా ప్రమోట్ చేస్తోంది. ఇక ఉపాసన దెబ్బతో మామూలు కమర్షియల్ హీరోగా ఉన్న రామ్చరణ్కు ఈ రోజు ఏకంగా అంతర్జాతీయంగా మంచి పాపులారిటీ దక్కింది.
బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఉన్నా ఆమె పోస్టులు, చేష్టలు ఆమెకు ఫాలోయింగ్ పెరిగేలా ఉంటాయే తప్పా భర్త మార్కెట్, భర్త పాపులారిటీకి ఉపయోగపడేలా ఉండవు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి అసలు ఇవేవి పట్టవు. భర్త సినిమాలు, ఇతర విషయాల్లో ఆమె ఏ మాత్రం జోక్యం చేసుకోదు. చివరకు ఆమెకు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెద్దగా ఉండరు. ఏదేమైనా భర్తలను ప్రమోట్ చేసే మ్యాజిక్ నమ్రత, ఉపాసనకు తెలిసినట్టుగా స్నేహారెడ్డి, ప్రణతికి పెద్దగా తెలియదనే అనిపిస్తోంది.