తెలుగు సినీ రంగం ఎటు వైపు ఉంది? ఏపీలో వైసీపీకి దన్నుగా నిలిచేవారు ఎవరు? టీడీపీని సపోర్టు చేసేవారు ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. తాజాగా నంది అవార్డులపై చెలరేగిన వివాదం ఇంకా సర్దు మణగలేదు. నంది అవార్డుల విషయాన్ని ప్రస్తావించిన.. సీనియర్ నిర్మాత అశ్వనీదత్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. అదే సమయంలో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల తర్వాత.. నందులు నడిచివస్తాయన్నారు. అంటే.. అశ్వనీదత్ చేసిన ఈ వ్యాఖ్యల అంతరార్థం.. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్ననేపథ్యంలో ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. తర్వాత.. ఏడాది నుం చి నంది అవార్డులు ప్రకటిస్తారనే అంతరార్థం దాగి ఉంది. అయితే.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి నటు డు పోసాని స్పందించినా.. రాజకీయంగా ఆయన వాటి జోలికి పోకుండా.. చాలా జాగ్రత్తగా తనదైన శైలిలో నే స్పందించారు.
అయితే.. అశ్వనీదత్ సహా.. ఘట్టమనేని హనుమంతరావు కూడా చేసిన వ్యాఖ్యల అనంతరం.. ఏపీలో రాజకీయాలపై తెలుగు ఇండస్ట్రీ చాలా నిశితంగానే గమనిస్తున్నట్టు తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా జగన్ హయాంలో వారిపై పెట్టిన ఆంక్షలు.. సినిమాలకు ఇస్తున్న అనుమతులు రద్దు చేయడం… సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను తన దగ్గరకు రప్పించుకున్న తీరు వంటివాటిపై ఇండస్ట్రీ ఆగ్రహంతో ఉందనే సంకేతాలు అయితే స్పష్టంగా వచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇది వైసీపీ కన్నా కూడా టీడీపీకి మేలు చేకూరుస్తుందని.. చంద్రబాబు హయాంలో తమకు మేలు జరిగిందన్న టోన్ నిర్మాతల నుంచి బాహాటంగానే వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీపై ఇండస్ట్రీ ప్రభావం వ్యతిరేకంగానే ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. అయితే… టీడీపీ ఈ విషయంలో సైలెంట్గా ఉండి.. అన్నీ గమనిస్తుండడం గమనార్హం.