ఏమాయచేశావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రిలోకి అడుగుపెట్టింది సమంత. మొదటి సినిమాతో సూపర్ హిట్ కోట్టిన సమంత ఇప్పటికి సినిమా ఇండస్ట్రిలోకి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఆ తర్వాత హీరో నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్నీ స్పీడ్గానే అయిపోయాయి. సమంత ఇటీవల నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె బాగా నిరాశలో ఉంది. ఈ సినిమా దెబ్బకు నిర్మాత దిల్ రాజుకి రూ. 25 కోట్ల వరకు నష్టం వచ్చిందట. సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సిటాడెల్ లో నటించగా ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేక పోయింది. దీంతో సమంత ఇండియన్ వెర్షన్లో నటిస్తున్న సిటాడెల్ లో ఇక్కడ చేంజ్ చేస్తేకాని ఈ సీరిస్ హిట్ కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సమంత అందాలు చూపించడం, గ్లామర్ ఎక్స్పోజింగ్ చేయడం కంటే కథలు ఎంచుకోవడంలో ఇకనైన జాగ్రత్త వహిస్తే మంచిదన్న సలహాలు ఇస్తున్నారు.
సమంత శాకుంతలం సినిమాలో నటించడానికి రెమ్యునరేషన్ రూ.5 కోట్లు తీసుకోగా.. ఆ సినిమా మొత్తం కలెక్షన్స్ కూడా రూ.5 కోట్ల వరకు రాలేదు. దీంతో సమంత ప్రస్తుతం నటిస్తున్న ఖుషి సినిమా పైన నమ్మకం పెట్టుకుంది. ఖుషి సినిమా హిట్ అయితే తప్ప సమంతకు అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు. అయితే ఇప్పటికే సమంత ఫేస్ లో గ్లో తగ్గిందన్నది క్లారిటీ వచ్చేసింది.
దీంతో ఆమెకు ఛాన్సులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఇండస్ట్రీ వాళ్లే అంటున్నారు. దీంతో పాటు శాకుంతలం ఫ్లాప్ అవ్వడంతో ఆమెను ఆమె అన్ని వర్గాల వారిని మెప్పించలేకపోయిందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే సమంత నటించిన ఖుషి సినిమా హిట్ అవుతుందా,.. లేదా..? అనేది చూడాల్సి ఉంది.