‘ ఖైదీ ‘ షూటింగ్‌కు చిరంజీవి, మాధ‌వి మ‌ధ్య గొడ‌వ వెన‌క ఇంత జ‌రిగిందా… !

మెగాస్టార్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ఖైదీ సినిమా ఒకటి. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఖైదీ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అంతేకాకుండా ఖైదీ సినిమాను రీరిలీజ్ చేయాలని కూడా అభిమానులు కోరుతున్నారు. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా సంయుక్త ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.

Chiranjeevi's breakout hit 'Khaidi' completes 38 years - Telugu News - IndiaGlitz.com

అంతేకాకుండా ఈ సినిమాను అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెరకెక్కించారు. 24 లక్షల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఆ రోజుల్లోనే దాదాపు రు. 8 కోట్ల కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగుతోపాటు హిందీ కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాతోనే చిరంజీవి ఎన్టీఆర్ రేంజ్ లో మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు.

1983 లో ఈ చిత్రాన్ని విడుదల చేయగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలోని రగులుతోంది మొగలి పొద పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా సినిమాలోని అన్ని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరు అయిన ధనుంజయ రెడ్డి ఖైదీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవికి ఒక లక్ష పదివేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు చెప్పారు.

Chiranjeevi's breakout hit 'Khaidi' completes 38 years - Telugu News - IndiaGlitz.com

అంతేకాకుండా సినిమాలో హీరోయిన్ గా నటించిన మాధవికి రు. 50 వేలు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు చెప్పారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి మాధవి మధ్య గొడవలు జరిగాయంటూ వచ్చిన వార్తల గురించి ఆయన స్పందించారు. భేదాభిప్రాయాలు అన్ని చోట్ల ఉంటాయని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్ప గొడవలేమి జరగలేదని అన్నారు.

అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతగా ఉన్న ఆయ‌న హీరో, హీరోయిన్ల మ‌ధ్య‌ కొన్ని విషయాల్లో, కాస్ట్యూమ్ విషయంలో భేదాభిప్రాయాలు కూడా వచ్చినట్టు తెలిపారు. కానీ పెద్ద పెద్ద గొడ‌వ‌లు ఏమీ జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.