టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రస్తుతం ఎలాంటి ఏ చిన్న విషయం బయటపడ్డ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది. అదే సమయంలో మరి ఎక్కువగా తమన్నా పై రూమర్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ విషయం పక్కనపడితే స్టార్ హీరోలతో తమన్నా నటించే సమయంలో వారి భార్యలను చూసి తమన్నా గజగజ వణికిపోయేదట . తమన్నా వారి కి అంతలా భయపడడానికి కారణం ఏంటి ఆమె చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమాతో మొదటి విజయం అందుకుంది. తర్వాత వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్కుజంటగా ఊసరవెల్లి సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ సినిమా షూటింగ్ కి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా వచ్చేదట. షూటింగ్లో తమన్నా ఎన్టీఆర్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు చూసి లక్ష్మీ ప్రణతి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యేదట అలాగే తమన్నా ఎన్టీఆర్ తో మాట్లాడినా కూడా అసలు ఇష్టపడేది కాదట.
అంతేకాకుండా చాలాసార్లు ఇంటికి వెళ్ళాక కూడా ఆ రొమాంటిక్ సన్నివేశాలని తలుచుకుని లక్ష్మీపణతి ఎంతో ఇబ్బంది పడేదట. ఆ సినిమా ఇండస్ట్రీలు ఇవన్నీ ఎంతో కామన్ అని ఇలా చేస్తేనే ప్రేక్షకులు మమ్మల్ని చూస్తారని ఎన్టీఆర్ చెప్పడంతో అప్పటినుంచి లక్ష్మీపణతి తన పద్ధతిని మార్చుకున్నారట. ఇక అల్లు అర్జున్తో బద్రీనాథ్ సినిమా చేసే టైంలో కూడా స్నేహ రెడ్డితో తమన్నాకి మరోసారి ఎన్టీఆర్ భార్యతో వచ్చిన సమస్య వచ్చిందట. ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చేసే సమయంలో స్నేహారెడ్డి చాలా కోపంగా తమన్నా ను చూసేదట.
ఆమె చూసే చూపులకి తమన్నా భయపడి చాలా టేక్స్ తీసుకునేదట. ఇక తమన్నా భయపడిన మరో స్టార్ హీరో భార్య ఉపాసన. ఇక తమన్నా చరణ్ భార్య ఉపాసన కారణంగా ఆయనతో మాట్లాడటానికి కూడా ఎంతో భయపడేదట. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రచ్చ సినిమా రామ్ చరణ్ ఉపాసన పెళ్ళైన రెండు నెలలకు విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఉపాసనకి తమన్న చాలా భయపడేది. కానీ ఉపాసన, స్నేహ రెడ్డి, లక్ష్మీ ప్రణతిలా అంత కోపంగా కాకుండా కాస్త స్నేహంగానే తమన్నాతో ఉండేదట. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసే సమయంలో తమన్నా వాళ్ళ భార్యలకు చాలా భయపడి పోయేదట.