కొన్నిసార్లు ఎవరి జీవితంలోనైనా ఎవరు ఊహించని అనుకోని సంఘటనలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘటనలు గుర్తుతెచ్చుకుంటే మనకు తెలియకుండానే వణుకు వచ్చేస్తుంది. ఇక అలాంటి ఘటనే టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల జీవితంలో జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటి ఆ స్టార్ సెలబ్రిటీలలో ఎవరో ఇప్పుడు చూద్దాం. మన తెలుగు చిత్ర పరిశ్రమ తమిళనాడులో ఉండే రోజుల్లో అక్కడే ఎక్కువ షూటింగ్స్ జరిగేవి.
మన సినీ సెలబ్రిటీలు కూడా తమిళనాడులోనే ఎక్కువ ఉండేవారు. ఓ రోజు దీపావళి పండుగ వచ్చింది మన స్టార్ హీరోలు అంతా ఓ విమానంలో పండగ కోసం తన సొంత ఇంటికి బయలుదేరారు. టాలీవుడ్కు చెందిన 60 మంది స్టార్లు ఈ విమానంలో ఉన్నారు. ఈ విమానం ఎవరూ ఊహించిన విధంగా నెల్లూరు జిల్లాలో క్రాస్ ల్యాండింగ్ అయింది. 1993 నవంబర్ 15న ఈ ఘటన జరిగింది.
చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, సుధాకర్, దర్శకుడు బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇలా చాలా మంది ప్రముఖులు వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై టూ హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు. విమానం గాలిలో ఉంది. హైదరాబాద్ లో ల్యాండింగ్ కావాలి. వాతావరణం సహకరించక.. గాలిలోనే తిరిగింది. పైనే చక్కర్లు కొడుతుండగా.. విమానంలో సాంకేతిక లోపం కూడా వచ్చింది. ఇక దాంతో ఆ విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేసేశాడు ఫైలెట్.
నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి మధ్య ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ల్యాండింగ్ సమయంలో కాస్త అటు ఇటు అయినా.. పెద్ద ప్రమాదమే జరిగింది. తడిగా ఉన్న పంట పొలాల్లోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన ముందే.. ఓ పెద్ద బండ రాయి ఉంది. మరికాస్త ముందుకు వెళితే.. చెరువు ఉంది. కెప్టెన్ భల్లా, కో పైలేట్ వేల్ రాజ్.. సమయ స్ఫూర్తితో ల్యాండింగ్ చేశారు.
అక్కడకు వచ్చిన జనాలంతా మెుదట చూసి.. ఏదో సినిమా షూటింగ్ అనుకున్నారట. అప్పుడు సెల్ ఫోన్లు కూడా సరిగా అందుబాటులో లేవు. అందరూ పొలాల్లో నుంచి బయటకు వచ్చి.. సమాచారం చేరవేశారు. అలాంటా ఈ విమాన ప్రమాదం నుంచి స్టార్ సెలబ్రిటీలందరూ బయటపడ్డారు. ఇప్పటికీ ఈ ఘటన గుర్తుకు వస్తే ఆ సెలబ్రిటీలు అందరూ భయపడిపోతూ ఉంటారు.