టాలీవుడ్లో ఒకప్పుడు వివి. వినాయక్ అంటే స్టార్ హీరోలు కూడా మనోడితో సినిమా చేసేందుకు వెయిట్ చేసేవారు. వరుసగా ఆది, చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, లక్ష్మీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సూపర్ హిట్లే. ఆ తర్వాత ప్లాపులు పడినా మధ్యలో ఎన్టీఆర్ సాంబ, అదుర్స్ లాంటి అవకాశాలు ఇవ్వడంతో ఎన్టీఆర్ క్రేజ్తో ఆ సినిమాలు ఆడడంతో గట్టెక్కుకుంటూ వచ్చాడు. రేసుగుర్రం ఒకటి హిట్.
ఇంకా చెప్పాలంటే వినాయక్ సీన్ బద్రినాథ్ సినిమా నుంచే అయిపోతూ వచ్చింది. ఖైదీ నెంబర్ 150 పేరుకు మాత్రమే వినాయక్ డైరెక్టర్… ఆ సినిమా రీమేక్.. ఇక్కడ చాలా వరకు షూటింగ్ మెగా కాంపౌండ్ వ్యక్తులే ఫినిష్ చేశారని అంటారు. ఆ తర్వాత ఇంటిలిజెంట్ అట్టర్ప్లాన్. రీసెంట్గా హిందీ ఛత్రఫతి రీమేక్ ఘోరమైన డిజాస్టర్. ఇప్పుడు వినాయక్ డైరెక్షన్ మర్చిపోయాడంటూ జోకులు వేసుకుంటున్నారు.
సరిగ్గా ఇప్పుడు మరో డైరెక్టర్ సురేందర్రెడ్డిది కూడా అదే పరిస్థితి. మామూలుగానే సురేందర్రెడ్డి వంటి బద్ధకపు మనిషి అంటారు. ఎన్టీఆర్ ఊసరవెల్లి, అశోక్ మహేష్ అతిథి ఛాన్సులు ఇస్తే నాశనం చేశాడు. రవితేజకు కిక్ 2, చిరు సైరా లాంటి డిజాస్టర్లు ఇచ్చాడు. ఇక అఖిల్ బంగారం లాంటి ఛాన్స్ ఇస్తే ఏజెంట్తో అఖిల్ కెరీర్ నాశనం చేసి పడేశాడు.
ఇక ఇప్పుడు సురేందర్రెడ్డి పేరు చెపితేనే ఏ హీరో కూడా దగ్గరకు రానిచ్చే పరిస్తితి లేదు. దీంతో కొత్త హీరో అయిన మెగా మేనళ్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు సమాచారం. ఎన్టీఆర్, మహేష్, అఖిల్, చిరంజీవి, బన్నీ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సురేందర్కు ఇప్పుడు వైష్ణవ్ తేజ్ లాంటి కొత్త హీరో గతి అయ్యాడు.
విచిత్రం ఏంటంటే ఈ సినిమాను కూడా సురేందర్ రెడ్డి తనతో పాటు ప్రాజెక్ట్ ఫైనాన్స్ చేయడానికి ఓ నిర్మాతను వెనుక్కుని కలిసి చేసుకోవాల్సి వస్తోంది. అంటే సురేందర్ రెడ్డిని నమ్మి ఓ సినిమా నిర్మించేందుకు, కనీసం ఫైనాన్స్ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి వచ్చేసిందనే అంటున్నారు. ఏదేమైనా టాలీవుడ్లో సురేందర్ రెడ్డి మరో వినాయక్లా అయిపోయాడన్నదే ఇప్పుడు వినిపిస్తోన్న టాక్.