చిత్ర పరిశ్రమలు ఉండే సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిని చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు ఏగబడుతూ ఉంటారు. ఫోటోలు కోసం పిచ్చెక్కి పోతుంటారు. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం ఇలాంటి వాటిని ఇష్టపడరు.. సాధారణ జీవితం గడిపేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే సమయంలో చాలామంది చిత్ర పరిశ్రమలో ఉండేే సెలబ్రిటీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు ఎన్నో అనారోగ్య సమస్యలు బారిన పడి వాటి నుంచి కోలుకున్నారు.
ముందుగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో హీరోయిన్గా నటించిన షీలా కౌర్.. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమాలో కూడా నటించింది. ఇక అదే సమయంలో ఈమె ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడింది. తర్వాత కొన్ని రోజులు చిత్ర పరిశ్రమకు దూరమై ట్రీట్మెంట్ తీసుకుని పూర్తిస్థాయిలో కోలుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి రెడీగా ఉంది.
అలాగే మరో క్రేజీ హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా భయంకరమైన వ్యాధికి గురైంది.. కేవలం 25 ఏళ్లకే బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో పెళ్లయిన కొద్దిరోజులకి ఈమె భర్త వదిలేసాడు.. అయినప్పటికీ ఎంతో ధైర్యంతో ఆ వ్యాధిని జయించింది. ఇక మరో సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలా కూడా తన కెరియర్ మంచి పిక్ లో ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడింది.. తరవాత సినిమాలకు దూరమైంది.. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుని బాగానే ఉన్నప్పటికీ సినిమాలకు మాత్రం దూరంగానే ఉంటుంది.
మరో క్రేజీ హీరోయిన్ సోనాలి బింద్రే, మహేష్ హీరోగా వచ్చిన మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ.. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సోనాలి క్యాన్సర్ బారిన పడింది.. ఆ సమయంలో ఈమెను ఎవరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.. ఆ వ్యాధిపై ఎంతో పోరాటం చేసి ఎట్టకేలకు ఆ వ్యాధి నుంచి బయటపడింది.
మరో నటి గౌతమి, ఈమె కూడా… బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్ తో మృతి చెందింది. అయినప్పటికీ గౌతమి మాత్రం పోరాడి విజయం సాధించింది. ఇలా వీరే కాకుండా ఎందరో సెలబ్రిటీలు ఎన్నో అరుదైన వ్యాధులకు గురై వాటి ద్వారా మరణించిన వారు ఉన్నారు వాటి నుంచి కోలుకుని ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న వారు ఉన్నారు.